రైతును రాజు చేయడమే.. సీఎం కేసీఆర్ లక్ష్యం

దిశ, సూర్యాపేట: తెలంగాణలో రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని పెన్ పహడ్, చివ్వెంల మండల కేంద్రంలో రైతు నిర్మాణ వేదికల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. పెట్టుబడులకు రైతు బంధు పథకం ఇచ్చి రైతులను ఆదుకుంటుందని అన్నారు. […]

Update: 2020-07-23 05:01 GMT

దిశ, సూర్యాపేట: తెలంగాణలో రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని పెన్ పహడ్, చివ్వెంల మండల కేంద్రంలో రైతు నిర్మాణ వేదికల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతులకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. పెట్టుబడులకు రైతు బంధు పథకం ఇచ్చి రైతులను ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News