గని కార్మికుడు లింగయ్య మృతి.. మంత్రి విచారం!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 బీ గనిలో బుధవారం సాయంకాలం జరిగిన ప్రమాదంలో కార్మికుడు లింగయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అనంతరం బొగ్గు గనిలో ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత పై మంత్రి ఆరా తీశారు. గనిలో ప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో […]

Update: 2020-09-03 00:08 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 బీ గనిలో బుధవారం సాయంకాలం జరిగిన ప్రమాదంలో కార్మికుడు లింగయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

అనంతరం బొగ్గు గనిలో ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత పై మంత్రి ఆరా తీశారు. గనిలో ప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుడు లింగయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు.

Tags:    

Similar News