మట్టి గణనాథుడినే పూజిద్దాం: హరీశ్ రావు

దిశ, సిద్దిపేట : వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలి అన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే అని, అన్ని విఘ్నాలు తొలగి, అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుడిని ఆయన ప్రార్ధించారు. కరోనా మహమ్మారి అనే విఘ్నం తోలగాలని కోరుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని, అందరం ఇంట్లోనే మట్టి గణపతి ప్రతిమను […]

Update: 2021-09-09 04:34 GMT

దిశ, సిద్దిపేట : వినాయక చవితి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలి అన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే అని, అన్ని విఘ్నాలు తొలగి, అన్ని కార్యాలు సిద్దించాలని ఆ గణనాథుడిని ఆయన ప్రార్ధించారు. కరోనా మహమ్మారి అనే విఘ్నం తోలగాలని కోరుకున్నారు. ఆ విఘ్నేశ్వరుని దీవెనతో మనం చేసే కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని, అందరం ఇంట్లోనే మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించుకొని ఇంటిల్లిపాది వేడుకగా పూజించాలన్నారు.

ప్రకృతిని దేవుని రూపంలో పూజించే గొప్ప పండగ అని, మట్టి గణపతినే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ప్రకృతి సిద్దమైనటువంటి పత్రులు, పూలదండలతో పూజిద్దాం. ప్లాస్టిక్ పూలు, దండలు వద్దు, నిమజ్జనం సమయంలో చెరువులలో, వాగులను ప్లాస్టిక్ రహితం ఉంచుకొని పర్యావరాన్ని సంరక్షించు కుందామన్నారు. మన అందరి పై విఘ్నేశ్వరుని అనుగ్రహము ఉండాలని కోరుకున్నారు.

Tags:    

Similar News