‘ఆ చట్టం విజయవంతం కావాలని కోరుకున్న’

దిశ ప్రతినిధి, నల్లగొండ: తన ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని నా ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. అంతేగాకుండా సీఎం కేసీఅర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన […]

Update: 2020-09-13 11:01 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: తన ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని నా ఇష్ట దైవమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు.

అంతేగాకుండా సీఎం కేసీఅర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం విజయవంతం కావాలని కోరుకున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో యాదాద్రి దేదీప్యమానంగా తయారు అవుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశనంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్యే గొంగడి సునిత తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News