గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో ఎంపీ, మంత్రి బస

విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికుల్లో భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విశాఖలోని పద్మనాభనగర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అనుసరించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సంవత్సరం పాటు వైద్య […]

Update: 2020-05-11 22:10 GMT

విశాఖ గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. స్థానికుల్లో భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విశాఖలోని పద్మనాభనగర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాత్రి బస చేశారు. గ్యాస్ లీక్ బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక అనుసరించి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకుంటామని విజయసాయిరెడ్డి తెలిపారు. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో సంవత్సరం పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News