24 గంటల సమయం ఇస్తున్నా: అసదుద్దీన్ ఓవైసీ

దిశ, వెబ్ డెస్క్: 24 గంటల సమయం ఇస్తున్నాననీ, పాతబస్తీలో పాకిస్తాన్ వారు ఎవరున్నారో చెప్పాలని బీజేపీకి ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ సవాల్ విసిరారు. దేశంలో ఉన్న వారంతా ఇండియన్లే అని ఆయన అన్నారు. 970 కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని తెలిపారు. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాల్ విసిరారు. దేశం నుంచి ముస్లీంలను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. బీజేపీ ఎంపీ వచ్చి తనను జిన్నాతో పోల్చారని అన్నారు. […]

Update: 2020-11-24 08:20 GMT

దిశ, వెబ్ డెస్క్: 24 గంటల సమయం ఇస్తున్నాననీ, పాతబస్తీలో పాకిస్తాన్ వారు ఎవరున్నారో చెప్పాలని బీజేపీకి ఎంఐఎం నేత అసదుద్దిన్ ఓవైసీ సవాల్ విసిరారు. దేశంలో ఉన్న వారంతా ఇండియన్లే అని ఆయన అన్నారు. 970 కిలోమీటర్లు చైనా ఆక్రమించిందని తెలిపారు. దమ్ముంటే అక్కడకు వెళ్లి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేయాలని సవాల్ విసిరారు.

దేశం నుంచి ముస్లీంలను ఎవరూ వేరు చేయలేరని చెప్పారు. బీజేపీ ఎంపీ వచ్చి తనను జిన్నాతో పోల్చారని అన్నారు. జిన్నాకు తమకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో అసహనం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. టెర్రరిస్టు, పాకిస్తాన్ పదాలు లేకుండా 29 వరకు ప్రచారం చేయగలరా అని ఆర్ఎస్ఎస్, బీజేపీకి సవాల్ విసురుతున్నానని అన్నారు. దమ్ముంటే చదువు, అభివృద్ధి గురించి చెప్పి గెలవాలని అన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News