వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

దిశ, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లా‌ అంబగార్ చౌకీ ఏరియాలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. మొహ్లా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని పార్థి – పర్వీదిహ్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక ప్రొక్లైన్, రెండు మిక్సింగ్ మిషన్లు, ఒక హైడ్రా యంత్రం దగ్ధమైనట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Update: 2020-09-24 13:36 GMT

దిశ, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లా‌ అంబగార్ చౌకీ ఏరియాలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. మొహ్లా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని పార్థి – పర్వీదిహ్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక ప్రొక్లైన్, రెండు మిక్సింగ్ మిషన్లు, ఒక హైడ్రా యంత్రం దగ్ధమైనట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News