మావోయిస్టుల చేతిలో కానిస్టేబుల్ దారుణ హత్య

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. గంగలూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నఎస్. పూనమ్ శనివారం సాయంత్రం అత్తగారింటికి వెళుతుండగా మార్గ మధ్యంలో మావోయిస్టులు అతడిని అడ్డగించి అపహరించారు. అనంతరం అతడిని హత్య చేసి కేష్కుతుల్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని భైరామ్‌గఢ్‌కి చేర్చి.. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.  

Update: 2021-03-21 08:22 GMT

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. గంగలూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నఎస్. పూనమ్ శనివారం సాయంత్రం అత్తగారింటికి వెళుతుండగా మార్గ మధ్యంలో మావోయిస్టులు అతడిని అడ్డగించి అపహరించారు. అనంతరం అతడిని హత్య చేసి కేష్కుతుల్ సమీపంలో మృతదేహాన్ని పడేశారు. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని భైరామ్‌గఢ్‌కి చేర్చి.. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News