ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పలుగుట్ట (కేదార ఆశ్రమం) దగ్గర ఓ జంట బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగులమందు తాగి కారులో వెల్మల్ గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను స్థానికులు గమనించి, అంబులెన్సు ద్వారా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆర్మూర్ మండలం మంథని గ్రామం చెందిన వెన్నెల(22), జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్ తండాకు చెందిన బద్రి(35)గా గుర్తించారు. […]

Update: 2020-08-26 11:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పలుగుట్ట (కేదార ఆశ్రమం) దగ్గర ఓ జంట బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగులమందు తాగి కారులో వెల్మల్ గ్రామం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను స్థానికులు గమనించి, అంబులెన్సు ద్వారా జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆర్మూర్ మండలం మంథని గ్రామం చెందిన వెన్నెల(22), జక్రాన్‌పల్లి మండలం లక్ష్మాపూర్ తండాకు చెందిన బద్రి(35)గా గుర్తించారు. బద్రికి ఇది వరకే వివాహం అయి భార్య పిల్లలు ఉన్నప్పటికీ, వెన్నెలతో ప్రేమాయణం నడుపుతున్నట్టు సమాచారం. మరో యువతితో కలసి వెన్నెలను ఆర్మూర్ నుంచి కారులో నందిపేట ఆశ్రమానికి తీసుకొచ్చినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని, దర్యప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News