రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి 

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటన జిల్లా పరిధిలోని మాన్యంకొండ స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. చౌదర్పల్లి గ్రామానికి చెందిన గోవింద్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ అనే ఇద్దరు యువకులు అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై మహబూబ్ నగర్ కు బయలుదేరారు. మాన్యంకొండ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి బలంగా గాయాలవ్వడంతో […]

Update: 2020-07-30 03:36 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు.ఈ ఘటన జిల్లా పరిధిలోని మాన్యంకొండ స్టేజీ సమీపంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. చౌదర్పల్లి గ్రామానికి చెందిన గోవింద్ యాదవ్, బాలకృష్ణ గౌడ్ అనే ఇద్దరు యువకులు అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై మహబూబ్ నగర్ కు బయలుదేరారు. మాన్యంకొండ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇరువురికి బలంగా గాయాలవ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెనుక వస్తున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News