గ్యాస్ లీక్ ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

దిశ, అమరావతి బ్యూరో: విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని […]

Update: 2020-06-29 21:31 GMT

దిశ, అమరావతి బ్యూరో: విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరవకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. గ్యాస్ లీకేజ్ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు

Tags:    

Similar News