మరింత కట్టుదిట్టంగా లాక్డౌన్
దిశ, మహబూబ్నగర్ మహబూబ్నగర్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద బుధవారం టూటౌన్ సీఐ శ్రీనివాస చారి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ రైడింగ్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అనవసరంగా రోడ్లపై వస్తే ఉపేక్షించేది లేదని సీఐ స్పష్టం […]
దిశ, మహబూబ్నగర్
మహబూబ్నగర్ పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద బుధవారం టూటౌన్ సీఐ శ్రీనివాస చారి ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. అనవసరంగా రోడ్ల మీదికి వచ్చిన వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ రైడింగ్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అనవసరంగా రోడ్లపై వస్తే ఉపేక్షించేది లేదని సీఐ స్పష్టం చేశారు.
Tags: Mahabubnagar,lockdown,strict