తెలంగాణలో అక్కడ లాక్‌డౌన్

దిశ, హుస్నాబాద్: కరోనా సెంకడ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు కానుంది.  ఈ మేరకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండనున్నాయి. మధ్యాహ్నాం నుంచి మండల కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేయాలని బెజ్జంకి గ్రామ సర్పంచి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, గ్రామపాలకవర్గ […]

Update: 2021-05-05 04:31 GMT

దిశ, హుస్నాబాద్: కరోనా సెంకడ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఈ నెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు లాక్‌డౌన్ అమలు కానుంది. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండనున్నాయి. మధ్యాహ్నాం నుంచి మండల కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేయాలని బెజ్జంకి గ్రామ సర్పంచి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, గ్రామపాలకవర్గ సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మనం చేశారు. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ఆంక్షలను పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని ప్రజలకు గ్రామ పాలకవర్గం తెల్చిచెప్పింది.

Tags:    

Similar News