ఎండాకాలంలో వానలు ఎందుకు పడుతాయి?

ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. రోజు రోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మండే ఎండలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక

Update: 2024-05-08 09:43 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. రోజు రోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. మండే ఎండలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక వర్షం పడితే అసలు ఆ ఫీలింగే బాగుంటుంది కదా.. అయితే ఇలా జరుగుతుంది.

సమ్మర్‌లో కూడా ఒక్కోసారి అధిక గాలితో కుండపోత వానలు కురుస్తాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంటుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎందుకు ఇలా మండే ఎండల్లో వర్షం పడుతుంది. దీనికి గల కారణం ఏమిటని? కాగా, సమ్మర్‌లో వర్షం పడటానికి ఒకొక్కకరు, ఒక్కో కారణం చెబుతున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం.

అయితే దక్కన్ పీఠభూమి ప్రాంతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొన్ని ప్రాంతాలలో సమ్మర్‌లో వర్షాలు పడుతాయంట. అలాగే మఠ్వాడ ప్రాంతం సమీపంలో ఉండటం వలన క్యుమలోనింబస్ మేఘాలు ఏర్పటి వాటి వలన ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతే కాకుండా, వర్షాపాతంలో కూడా రకాలు ఉంటాయంట. అందులో ఉష్ణప్రసరణ వర్షపాతం ఒకటి. ఇది మండే ఎండాకాలంలో పడుతుంటుంది. అయితే వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వలన వాతావరణంలోని గాలి ఉష్ణోగ్రత పెరిగి తేలిక అవుతుంది. దీంతో అది చాలా ఎత్తుకి వెళ్తూ.. నీటి బిందువులు తయారు అవుతాయి. దీనిని మోల్ అని కూడా అంటారు. ఇలా ఒక్కో నీటి బిందువు తయారై ఉష్ణం విడుదల కావడం వలన మబ్బు ఉష్ణోగ్రత పెరిగి, నీటి బిందువులు వర్షంలా కింద పడుతాయంట. దీని కారణంగా సమ్మర్‌లో వర్షం పడుతుంది. దీనికి దట్టమైన మేఘాలు రావాల్సిన అవసరం లేదు.. మబ్బు ఎక్కువగా లేకపోయినా ఈ వర్షం పడుతుందంటున్నారు కొందరు నిపుణులు.

Similar News