Scientists may have found a method to predict death by the way people walk

మనుషులు నడిచే విధానంతో వారి మరణాన్ని అంచనా వేయొచ్చని మణికట్టుకు ధరించిన మోషన్ సెన్సార్‌లతో నిర్వహించిన ఒక అధ్యయనం సూచించింది.

Update: 2022-10-23 11:23 GMT

దిశ, ఫీచర్స్ : మనుషులు నడిచే విధానంతో వారి మరణాన్ని అంచనా వేయొచ్చని మణికట్టుకు ధరించిన మోషన్ సెన్సార్‌లతో నిర్వహించిన ఒక అధ్యయనం సూచించింది. ఈ ట్రాకింగ్ డివైసెస్ నుంచి తీసుకోబడిన కొలతలు, డేటా ఐదేళ్ల తర్వాత ఒకరి మరణాల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు.

ఇల్లినాయిస్ యూనివర్సిటీ పరిశోధకులు 14 ఏళ్లుగా లక్ష మందికిపైగా వ్యక్తుల నుంచి హెల్త్, బయోమెట్రిక్ డేటా సేకరించారు. అధ్యయన రచయిత బ్రూస్ స్కాట్జ్ ప్రకారం.. పాల్గొనేవారి యాక్సిలరేషన్, ఆరు నిమిషాల్లో నడక ద్వారా ప్రయాణించిన దూరాలను ట్రాక్ చేశారు. ఏరోబిక్ కెపాసిటీ, ఓర్పును అంచనా వేయడానికి ఉపయోగించే సబ్ మ్యాగ్జిమల్ ఎక్సర్‌సైజ్ టెస్ట్‌ను ఫిజియోపీడియాగా పిలుస్తారు. పనితీరు సామర్థ్యంలో మార్పులను పోల్చడానికి 6 నిమిషాల వ్యవధిలో ప్రయాణించే దూరం ఇందుకోసం ఉపయోగించబడుతుంది. మొత్తానికి ఈ ఆరు నిమిషాల వాకింగ్ టెస్ట్‌లో వేగం, త్వరణం, దూరాన్ని మణికట్టుకు ధరించిన సెన్సార్‌లోని యాక్సిలెరోమీటర్‌ ఉపయోగించి నిర్వహించారు. ఈ అధ్యయనం మొదటి ఏడాది తర్వాత శాస్త్రవేత్తలు వారి భవిష్యత్ మరణ నమూనాను ఉపయోగించి చేసిన అంచనాలు 72 శాతం సరైనవిగా ఉండగా.. ఐదేళ్ల తర్వాత అది 73 శాతానికి చేరుకుంది.

ఇక 2021 నుంచి ఇదే విధమైన అధ్యయనం నడక ఆధారంగా మరణ అంచనాల్లో ఇదే విధమైన ఖచ్చితత్వాన్ని కనుగొంది. అయితే, ఇది నిమిషాలకు వ్యతిరేకంగా గంటల ఆధారంగా డేటాను విశ్లేషించింది. మొబైల్ ఫోన్, వ్రాత పరికరం వంటి యాక్సెస్ చేయగల సాంకేతికతను ఉపయోగించి 'నిష్క్రియ' పర్యవేక్షణకు కొత్త ఫలితాలు మంచి ఉదాహరణ అని స్కాట్జ్ వాదించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News