ఈ క్రెడిట్ కార్డులతో బిల్లు చెల్లిస్తే ఇక ఆపేయడం బెటర్.. మే 1 నుంచి బాదుడే బాదుడు..

రెంట్, కరెంట్ బిల్లు లాంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డు ద్వారా కట్టడం సాధారణం అయిపోయింది. దీనివల్ల రివార్డులు

Update: 2024-04-30 03:57 GMT

 దిశ, ఫీచర్స్ : రెంట్, కరెంట్ బిల్లు లాంటి యుటిలిటీ బిల్లులు క్రెడిట్ కార్డు ద్వారా కట్టడం సాధారణం అయిపోయింది. దీనివల్ల రివార్డులు వస్తున్నాయని కష్టమర్లు కూడా మొగ్గుచూపారు. దీనికే అలవాటు అయిపోయారు. అయితే బ్యాంకులు ఇప్పుడు అవార్డులకు బదులు సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. yes Bank, IDFC Bank మే 1 నుంచి యుటిలిటీ బిల్లులపై 1% అదనంగా ఛార్జ్ చేయనున్నాయి. yes Bank లో ఈ లిమిట్ రూ. 15వేలు ఉంటే..IDFC Bank లో రూ. 20వేలు ఉంది. అంటే ఈ లిమిట్ క్రాస్ అయితే వినియోగదారుడు వన్ పర్సెంట్ అదనంగా పే చేయాల్సి ఉంటుంది.

యుటిలిటీ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని ఫుల్ ఫిల్ చేసుకునేందుకు స్పెషల్ గా చార్జీలు కలెక్ట్ చేస్తున్నాయి. అంతేకాదు కొంత మంది బిజినెస్ డీల్స్ చేస్తూ క్రెడిట్ కార్డులను మిస్ యూజ్ చేస్తున్నారు. క్రెడిట్ లిమిట్ తో పోలిస్తే యుటిలిటీ బిల్లుల మొత్తం చాలా తక్కువ ఉంటుండగా.. బిజినెస్ డీల్స్ ను యుటిలిటీ బిల్లు కింద చూపిస్తూ బెనిఫిట్ పొందుతున్నారు. అందుకే బ్యాంకులు ఇలా అదనపు రుసుము వసూలు చేసేందుకు నిర్ణయించాయి.

Similar News