Viral : మందేసి.. చిందేసి.. అర్ధరాత్రి రచ్చచేసిన యువతులు.. ఓ వ్యక్తి కాలర్ పట్టుకొని అలా చేస్తూ.. (వీడియో)

మద్యం మనిషిని మత్తులో ముంచుతుంది. ఒక్కోసారి తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వ్యవహరిస్తుంటారు డ్రింకర్స్. తాజాగా అలాంటి పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Update: 2024-05-10 12:32 GMT

దిశ, ఫీచర్స్ : మద్యం మనిషిని మత్తులో ముంచుతుంది. ఒక్కోసారి తాగిన మైకంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వ్యవహరిస్తుంటారు డ్రింకర్స్. తాజాగా అలాంటి పరిస్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఓ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో గమనిస్తే ముగ్గురు యువతులు ఫుల్లుగా తాగి అర్ధరాత్రిపూట దుర్భాషలాడుతూ రోడ్డుపైకి వచ్చారు. అంతలోనే గస్తీలో ఉన్న పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురిలో ఓ యువతి అలర్ట్ అయి సారీ చెప్పే ప్రయత్నం చేసింది. కానీ మరో యువతి మాత్రం మరింత రెచ్చిపోయింది. ఓ అధికారి కాలర్ పట్టుకుని నానా హంగామా చేసింది.

తాగిన మైకంలో ఆ ముగ్గురు యువతులు వీరంగం సృష్టించిన ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబై సమీపంలో గల విరార్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందులో ఓ యువతి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయడం గమనించవచ్చు. పోలీసులు వారిస్తున్నా, వారు కాస్త వెనక్కి తగ్గినా ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్లు ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా పోలీసులను తిడుతూ రచ్చ రచ్చ చేసింది. ఏకంగా ఇన్‌స్పెక్టర్‌ కాలర్‌ పట్టుకుని వాగ్వాదానికి దిగింది. ఇంకో యువతి లేడీస్ కానిస్టేబుల్ చేతిని కొరికింది. ఎట్టకేలకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా యువతులు మద్యం మత్తులో నానా యాగీ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News