తల్లిని హత్య చేసిన తనయుడికి జీవిత ఖైదు

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మీర్‌పేట పీఎస్ పరిధిలో తల్లిని హత్య చేసిన తనయుడికి ఎల్బీనగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెడు అలవాట్లతో తిరుగుతున్న కొండయ్య అనే వ్యక్తి.. తన తల్లిని డబ్బులు ఇవ్వాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపం పెంచుకున్న కొండయ్య 2016 జులై 13న తల్లిని తీవ్రంగా కొట్టి చంపాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. కొడుకే చంపినట్లు నిర్థారణ అయ్యింది. బుధవారం […]

Update: 2020-10-28 11:42 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మీర్‌పేట పీఎస్ పరిధిలో తల్లిని హత్య చేసిన తనయుడికి ఎల్బీనగర్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెడు అలవాట్లతో తిరుగుతున్న కొండయ్య అనే వ్యక్తి.. తన తల్లిని డబ్బులు ఇవ్వాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో కోపం పెంచుకున్న కొండయ్య 2016 జులై 13న తల్లిని తీవ్రంగా కొట్టి చంపాడు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. కొడుకే చంపినట్లు నిర్థారణ అయ్యింది. బుధవారం నిందితుడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

అటు.. 2015 ఏప్రిల్ 26న శంషాబాద్ గ్రామ శివారులో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు ఫకీరయ్యకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఎల్‌బీ‌నగర్ కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది.

Tags:    

Similar News