ప్రయాణికులకు శుభవార్త.. అందుబాటులోకి మరో ప్రత్యేక రైలు

వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మైసూరు- గౌహతి మధ్య ఓ సింగిల్‌ ట్రిప్‌ స్పెషల్‌ రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Update: 2023-04-23 16:12 GMT

దిశ, వెబ్ డెస్క్: వేసవిలో ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మైసూరు- గౌహతి మధ్య ఓ సింగిల్‌ ట్రిప్‌ స్పెషల్‌ రైలును నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం.06203 మైసూరులో 23న ఆదివారం ఉదయం 4:20 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు గుంతకల్లుకు వచ్చి, 25న రాత్రి 9:45 గంటలకు గౌహతికి చేరుకుంటుంది. ఈ రైలు బెంగళూరు, లింగంపల్లి, సికింద్రాబాద్‌, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ మీదుగా వెళ్లనుంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News