నిజామాబాద్‌లో దారుణం.. ఎవరూ రాలే

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కల్లోలం చేస్తున్న ఈ కష్ట సమయంలో కొందరి వ్యక్తులు వ్యవహరిస్తున్న విధానం దురదృష్టకరంగా ఉంది. ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తామూ మనుషులమేనన్న ఆలోచనను మరిచిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నందిపేట్ మండలం వెల్మల్ లో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, మృతిచెందిన ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామసిబ్బందే గ్రామపంచాయతీ […]

Update: 2020-08-21 01:10 GMT

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కల్లోలం చేస్తున్న ఈ కష్ట సమయంలో కొందరి వ్యక్తులు వ్యవహరిస్తున్న విధానం దురదృష్టకరంగా ఉంది. ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు. తామూ మనుషులమేనన్న ఆలోచనను మరిచిపోతున్నారు.

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని నందిపేట్ మండలం వెల్మల్ లో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అయితే, మృతిచెందిన ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. దీంతో గ్రామసిబ్బందే గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో మృతదేహాన్ని తీసుకెళ్లి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు చేశారు.

Tags:    

Similar News