మీ పాట జీవించే ఉంటుంది : లక్ష్మీ ప్రసన్న

దిశ, వెబ్ డెస్క్: చిన్నతనం నుంచి బాలు అంకుల్ ను చూస్తూ పెరిగాను అని.. ఆయన చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని తెలిపారు మంచు లక్ష్మీ ప్రసన్న. చిన్నప్పుడు ఆయన ఒడిలో ఆడుకోవడం .. ఆయన పాటలు వింటూ పెరగడం ఇంకా గుర్తుంది అన్నారు. తన మధుర స్వరం ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుందన్న లక్ష్మి.. తను నేర్పిన జీవిత పాఠాలు ఇప్పటికీ అనుసరిస్తున్నానని తెలిపింది. ఇంత గొప్ప మనిషి మనలను విడిచిపెట్టడం బాధ కలిగిస్తోందని.. బాలు […]

Update: 2020-09-25 07:58 GMT

దిశ, వెబ్ డెస్క్:
చిన్నతనం నుంచి బాలు అంకుల్ ను చూస్తూ పెరిగాను అని.. ఆయన చాలా వినయపూర్వకమైన వ్యక్తి అని తెలిపారు మంచు లక్ష్మీ ప్రసన్న. చిన్నప్పుడు ఆయన ఒడిలో ఆడుకోవడం .. ఆయన పాటలు వింటూ పెరగడం ఇంకా గుర్తుంది అన్నారు. తన మధుర స్వరం ఎవరినైనా మంత్ర ముగ్ధుల్ని చేస్తుందన్న లక్ష్మి.. తను నేర్పిన జీవిత పాఠాలు ఇప్పటికీ అనుసరిస్తున్నానని తెలిపింది. ఇంత గొప్ప మనిషి మనలను విడిచిపెట్టడం బాధ కలిగిస్తోందని.. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఆయన పాటలు ఎంతో మందిని టచ్ చేశాయని.. అతని స్వరం ఎప్పటికీ జీవించగలదు అని చెప్పింది. అంకుల్ మీరు లీడర్ పర్ ఎక్సలెన్స్ అని.. ఎప్పటికీ మిస్ అవుతానని .. వీడ్కోలు చెప్పింది.

https://www.instagram.com/p/CFj0fU7lzhM/?igshid=1ag17ed1nczvc

Tags:    

Similar News