లక్ష్యాన్ని ముద్దాడిన నేత కేసీఆర్: మంత్రి ఎర్రబెల్లి

దిశ, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర స‌మితి 20వ ఆవిర్భావ వేడుకలు పురస్క‌రించుకుని హ‌న్మకొండ‌లోని అమ‌రవీరుల స్థూపం, దివంగ‌త ఆచార్య జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. అంత‌కుముందు మంత్రి స్వగ్రామం వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి పార్టీ కార్యాల‌యంలో గులాబీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధ‌నే […]

Update: 2020-04-27 03:00 GMT

దిశ, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు పోరాటం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర స‌మితి 20వ ఆవిర్భావ వేడుకలు పురస్క‌రించుకుని హ‌న్మకొండ‌లోని అమ‌రవీరుల స్థూపం, దివంగ‌త ఆచార్య జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. అంత‌కుముందు మంత్రి స్వగ్రామం వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి పార్టీ కార్యాల‌యంలో గులాబీ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ఏకైక ల‌క్ష్యంగా పార్టీని పెట్టి, ఆ ల‌క్ష్యాన్ని ముద్దాడిన గొప్పనేత కేసీఆర్ అని కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేస్తున్నామన్నారు.

Tags: minister yerrabelli, trs farmation day, warangal, ts news

Tags:    

Similar News