వైఎస్ షర్మిల పార్టీపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ పెట్టే హక్కు అందరికీ ఉంటుందని, కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా తప్పకుండా స్వాగతిస్తున్నామని అన్నారు. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని హితవు పలికారు. ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణలో జనసేన తమవంతు పాత్ర పోషిస్తుందని, కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న […]

Update: 2021-07-08 05:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ షర్మిల పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ పెట్టే హక్కు అందరికీ ఉంటుందని, కొత్తగా ఎవరు పార్టీ పెట్టినా తప్పకుండా స్వాగతిస్తున్నామని అన్నారు. కాకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేసే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని హితవు పలికారు. ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణలో జనసేన తమవంతు పాత్ర పోషిస్తుందని, కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువతను రాజకీయాల్లోకి తీసుకొస్తామని అన్నారు. తెలంగాణలో ఆ దిశగా జనసేన ప్రయత్నం ప్రారంభించిదని తెలిపారు.

Tags:    

Similar News