IPL 2023 Final: అహ్మదాబాద్‌లో వర్షం.. టాస్ ఆలస్యం

Update: 2023-05-28 13:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్, చెన్నై మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్ స్టేడియంలో వర్షం మొదలైంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఐపీఎల్-16 ఫైనల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కోట్లాదిమంది క్రికెట్ అభిమానులకు వరుణుడు షాకిచ్చేలా ఉన్నాడు. ఫైనల్ జరిగే అహ్మదాబాద్‌లో వర్షం మొదలైంది. వర్షం వల్ల టాస్‌తో పాటు మ్యాచ్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ వరుణుడు ఇవాళ కరుణించకుంటే ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంది. సాయంత్రం 6.30 గంటలకు చిరుజల్లులుగా మొదలైన వాన.. క్రమంగా పెరుగుతోంది. దీంతో వర్షంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. మరోవైపు వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతానికైతే అంపైర్లు టాస్, మ్యాచ్ సమయంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

Tags:    

Similar News