IPL 2023: 56 డాట్ బాల్స్ ఆడితే.. ఓడిపోక గెలుస్తామా..? : పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్

Update: 2023-04-14 10:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సంచలన కామెంట్స్ చేశాడు. చెత్త బ్యాటింగ్‌తోనే మరో మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శిఖర్ ధావన్ జట్టు బ్యాటింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో బంతులను డాట్ చేయడం నేరమని, అలాంటిది తమ జట్టు ఏకంగా 56 బంతులను డాట్ చేసిందన్నాడు. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేసిన తర్వాత ఓడిపోక గెలుస్తామా..? అని అసహనం వ్యక్తం చేశాడు. స్వల్ప స్కోరే అయినా.. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చి.. మ్యాచ్‌ను చివరి వరకు తీసుకొచ్చారని ప్రశంసించాడు.

56 బంతులను డాట్ చేసినప్పుడు ఏ జట్టుకైనా ఓటమే ఎదురవుతుంది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి నెలకొంటుంది. శుభారంభాలు అందించడంపై మేం వర్క్ చేయాల్సి ఉంది. బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా. పోరాడే లక్ష్యం లేకపోయినా.. అసాధారణ బౌలింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు.

ఇవి కూడా చదవండి:

IPL 2023: మరో ఆసక్తికర పోరు.. నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ  

Tags:    

Similar News