పైపైకే..! అడ్డూ అదుపూ లేని కరోనా

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రెండో దశలోనూ కరోనా మహమ్మారి వీర విహారం సృష్టిస్తున్నది. మొదటి దశతో పోల్చితే రోజూవారీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,258 కేసులు నమోదయ్యాయి. 291 మంది మరణించారు. రోజూవారీ కేసులు ఇంత భారీ స్థాయిలో నమోదవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. అంతేగాక గతేడాది అక్టోబర్ 16 తర్వాత 62 వేలకు పైగా కేసులు నమోదవడం కూడా ఈరోజే కావడం గమనార్హం. శనివారం నమోదైన కేసులు.. నిన్నటి […]

Update: 2021-03-26 23:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రెండో దశలోనూ కరోనా మహమ్మారి వీర విహారం సృష్టిస్తున్నది. మొదటి దశతో పోల్చితే రోజూవారీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 62,258 కేసులు నమోదయ్యాయి. 291 మంది మరణించారు. రోజూవారీ కేసులు ఇంత భారీ స్థాయిలో నమోదవడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. అంతేగాక గతేడాది అక్టోబర్ 16 తర్వాత 62 వేలకు పైగా కేసులు నమోదవడం కూడా ఈరోజే కావడం గమనార్హం. శనివారం నమోదైన కేసులు.. నిన్నటి (59,118) తో పోల్చితే 5.3 శాతం ఎక్కువ. ఇక మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. తాజా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1.19 కోట్లకు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 4,52,647 ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,81,09,773 మందికి వ్యాక్సిన్ వేశారు.

Tags:    

Similar News