థామస్ కప్‌లో నెదర్లాండ్స్‌పై ఇండియా గెలుపు

దిశ, స్పోర్ట్స్: థామస్ కప్‌లో భారత బ్యాడ్మింటన్ బృందం శుభారంభం చేసింది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న థామస్ కప్ తొలి రౌండ్ ‌లో భారత పురుష షట్లర్ు 5-0 తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. శ్రీకాంత్ 21-12, 21-14 తేడాతో జోర్డాన్ క్వీకెల్‌పై విజయం సాధించాడు. రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 21-19, 21-12 తేడాతో రూబెన్ జిల్లే-టైస్ […]

Update: 2021-10-11 11:23 GMT

దిశ, స్పోర్ట్స్: థామస్ కప్‌లో భారత బ్యాడ్మింటన్ బృందం శుభారంభం చేసింది. డెన్మార్క్ వేదికగా జరుగుతున్న థామస్ కప్ తొలి రౌండ్ ‌లో భారత పురుష షట్లర్ు 5-0 తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, డబుల్స్‌లో సాత్వీక్ సాయిరాజ్ రాంకీరెడ్డి – చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. శ్రీకాంత్ 21-12, 21-14 తేడాతో జోర్డాన్ క్వీకెల్‌పై విజయం సాధించాడు. రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 21-19, 21-12 తేడాతో రూబెన్ జిల్లే-టైస్ వాన్ డెర్‌పై విజయం సాధించారు. మరో సింగిల్స్‌లో సాయి ప్రణీత్ 21-4, 21-12 తేడాతో రాబిన్ మెస్మన్‌పై గెలిచాడు. మరో డబుల్స్ మ్యాచ్‌లో అర్జున్-ధృవ్ కపిల 21-12, 21-13 తేడాతో ఆండీ బుజిక్-బ్రియాన్ వాస్నిక్‌పై గెలిచారు. ఆఖర్లో జరిగిన సింగ్స్‌లో సమీర్ వర్మ 21-6, 21-11 తేడాతో జిస్ దుయిస్‌పై విజయం సాధించాడు. దీంతో భారత బృందం 5-0 తేడాతో నెదర్లాండ్స్‌పై క్లీన్ స్వీప్ చేసింది.

Tags:    

Similar News