కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

దిశ, వెబ్‎డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అది వచ్చే 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీలోకి దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది.

Update: 2020-12-01 20:42 GMT

దిశ, వెబ్‎డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. అది వచ్చే 12 గంటల్లో మరింత బలపడి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో ఏపీలోకి దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వెల్లడించింది.

Tags:    

Similar News