వైసీపీలో భగ్గుమన్న గ్రూపు తగాదాలు

దిశ, అమరావతి బ్యూరో: నెల్లూరు జిల్లా కలువాయిలో వైసీపీలో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియెజకవర్గమైన ఆత్మకూరులో అధిపత్య పోరు కొనసాగుతోంది. వైఎస్సార్ పక్కా ఇళ్ళ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు వైసీపీ నేతలు నిరసనకు దిగారు. మళ్లీ సర్వే చేసి ఫ్లాట్లు ఇవ్వాలంటూ మాజీ జెడ్పీటీసీ అనిల్ రెడ్డి.. ఆయన వర్గీయులు ధర్నాకి దిగారు. వలంటీర్లకు, సర్పంచులకు తప్ప అర్హులకి ఇవ్వలేదని ఆరోపణలు చేసారు. తమను కావాలనే రామ […]

Update: 2020-07-03 04:32 GMT

దిశ, అమరావతి బ్యూరో: నెల్లూరు జిల్లా కలువాయిలో వైసీపీలో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియెజకవర్గమైన ఆత్మకూరులో అధిపత్య పోరు కొనసాగుతోంది. వైఎస్సార్ పక్కా ఇళ్ళ లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు వైసీపీ నేతలు నిరసనకు దిగారు. మళ్లీ సర్వే చేసి ఫ్లాట్లు ఇవ్వాలంటూ మాజీ జెడ్పీటీసీ అనిల్ రెడ్డి.. ఆయన వర్గీయులు ధర్నాకి దిగారు. వలంటీర్లకు, సర్పంచులకు తప్ప అర్హులకి ఇవ్వలేదని ఆరోపణలు చేసారు. తమను కావాలనే రామ నారాయణ రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనిల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News