ఆర్థికంగా అణచి వేస్తోంది….

దిశ ప్రతినిధి, మెదక్: ప్రజలపై పన్నుల భారం వేసి వారిని ఆర్ధికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్, ధరణీ పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు బీడీ రంగంపై ఆధారపడిన నిరు పేద కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. బీడీ కార్మికుల గురించి ఈ […]

Update: 2020-10-20 10:11 GMT

దిశ ప్రతినిధి, మెదక్:
ప్రజలపై పన్నుల భారం వేసి వారిని ఆర్ధికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఆర్ఎస్, ధరణీ పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు బీడీ రంగంపై ఆధారపడిన నిరు పేద కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పనిదొరకక ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. బీడీ కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు.

Tags:    

Similar News