ఓటీటీలో గోపీచంద్ సినిమా?

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. సినిమాల విడుదల కూడా ఆగిపోవడంతో కొందరు నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గులాబో సితాబో, పెంగ్విన్ లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదల కాగా, మరిన్ని లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో మరో తెలుగు హీరో కూడా తన సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేయనున్నారని టాక్. గోపీచంద్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. నయనతార హీరోయిన్ కాగా.. ఫైనాన్స్ […]

Update: 2020-06-19 07:21 GMT

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. సినిమాల విడుదల కూడా ఆగిపోవడంతో కొందరు నిర్మాతలు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గులాబో సితాబో, పెంగ్విన్ లాంటి చిత్రాలు ఓటీటీలో విడుదల కాగా, మరిన్ని లైన్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో మరో తెలుగు హీరో కూడా తన సినిమాను డైరెక్ట్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేయనున్నారని టాక్.

గోపీచంద్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. నయనతార హీరోయిన్ కాగా.. ఫైనాన్స్ సమస్యలతో మూడేళ్లుగా విడుదలకు నోచుకోకుండా పోయింది. కాగా ఇప్పుడు ఓటీటీ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు కమిట్ అయినట్లు సమాచారం. దీనిపై త్వరలో ప్రకటన వెలువడే చాన్స్ ఉందట.

Tags:    

Similar News