ప్రగతిభవన్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ప్రజల ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఖైరతాబాద్ వినాయకుడి సైజును కూడా తగ్గించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కరోనా నిబంధనలకు […]

Update: 2020-08-30 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ప్రజల ఇళ్లలోనే జరుపుకుంటున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఖైరతాబాద్ వినాయకుడి సైజును కూడా తగ్గించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వాహకులు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

Tags:    

Similar News