భావ ప్రకటన స్వేచ్ఛ సంపూర్ణ హక్కు కాదు

ముంబయి: అధికరణ 19(1ఎ)లో కింద రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన, ప్రసంగాల స్వేచ్ఛ`సంపూర్ణమైన హక్కు కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్యా ఠాక్రేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ బాంబే హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. రెండు వారాలపాటు ఆమెను అరెస్టు చేయబోరని సర్కారు తెలిపింది. ఈ విచారణలో భావ ప్రకటన స్వేచ్ఛకూ […]

Update: 2020-09-12 08:19 GMT

ముంబయి: అధికరణ 19(1ఎ)లో కింద రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన, ప్రసంగాల స్వేచ్ఛ'సంపూర్ణమైన హక్కు కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్యా ఠాక్రేలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ అరెస్టుల నుంచి రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది.

ఆమె దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ బాంబే హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. రెండు వారాలపాటు ఆమెను అరెస్టు చేయబోరని సర్కారు తెలిపింది. ఈ విచారణలో భావ ప్రకటన స్వేచ్ఛకూ పరిమితులుంటాయని చెప్పిన కోర్టు.. కేసు విచారణలో పోలీసులు దురుసుగా ప్రవర్తించినా, తన హక్కులు భంగమైనట్టు భావించినా పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని తెలిపింది.

Tags:    

Similar News