భయం పోగొట్టేందుకే ఈ శిబిరం : డాక్టర్ కమల్ గౌడ్

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నగరంలోని పెద్ద బజార్‌ పేద ప్రజల కోసం శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ రాజ్ కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. బీపీ, షుగర్ సంబంధిత వ్యాధుల పట్ల వైద్యులు అవగాహన కల్పించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు […]

Update: 2021-12-05 10:22 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నగరంలోని పెద్ద బజార్‌ పేద ప్రజల కోసం శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ రాజ్ కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. బీపీ, షుగర్ సంబంధిత వ్యాధుల పట్ల వైద్యులు అవగాహన కల్పించారు.

ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డా.రాజ్ కమల్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలు పొగొట్టేందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఉచితంగానే పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News