యువతికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్

దిశ, వెబ్‌డెస్క్ : యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని శంధోల్ జిల్లా జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జైత్‌పూర్‌కు చెందిన యువతిని ఈనెల 18న కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు ఆమెను గడాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో బంధించారు. అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఈనెల […]

Update: 2021-02-21 21:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యువతిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని శంధోల్ జిల్లా జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జైత్‌పూర్‌కు చెందిన యువతిని ఈనెల 18న కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు ఆమెను గడాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్‌లో బంధించారు. అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఈనెల 20న ఇంటి ముందు పడేసి వెళ్లారు.

వెంటనే ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో ఆదివారం సాయంత్రం జైత్‌పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిలో జైత్‌పూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు విజయ్ త్రిపాఠీ ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగిన అనంతరం అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, నిందితులు నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News