తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ జాగీర్ కాదు !

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీర్ కాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతులకు పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.1,850 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనడం కుదరదని చెప్పడం సరికాదని, రైతుల పట్ల సీఎం కేసీఆర్‌ అహంకారంతో మాట్లాడటం మానుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ప్రకటనపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ […]

Update: 2020-10-12 08:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీర్ కాదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రైతులకు పెద్దపీట వేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ.1,850 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనడం కుదరదని చెప్పడం సరికాదని, రైతుల పట్ల సీఎం కేసీఆర్‌ అహంకారంతో మాట్లాడటం మానుకోవాలని సూచించారు. కేసీఆర్‌ ప్రకటనపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News