రెచ్చగొట్టింది మేం కాదు వాళ్లే : భారత ఆర్మీ

దిశ, వెబ్‌డెస్క్ : వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాము సంయమనం పాటిస్తున్నామని, ఏ దశలోనూ LACని అతిక్రమంచలేదని పేర్కొంది. భారత్ ఆర్మీ ఎప్పుడు మొదట కాల్పులు జరపబోదని, శత్రువుల నుంచి వస్తేనే దీటుగా సమాధానం చెబుతామని స్పష్టంచేసింది. మన బలగాలు శాంతియుతంగా, సామరస్యంగా ఉంటే కావాలనే చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని వివరించించింది. ‘నిన్న తూర్పు లద్దాక్‌లో చైనా కాల్పులకు తెగబడింది. […]

Update: 2020-09-08 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం తాము సంయమనం పాటిస్తున్నామని, ఏ దశలోనూ LACని అతిక్రమంచలేదని పేర్కొంది. భారత్ ఆర్మీ ఎప్పుడు మొదట కాల్పులు జరపబోదని, శత్రువుల నుంచి వస్తేనే దీటుగా సమాధానం చెబుతామని స్పష్టంచేసింది.

మన బలగాలు శాంతియుతంగా, సామరస్యంగా ఉంటే కావాలనే చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని వివరించించింది. ‘నిన్న తూర్పు లద్దాక్‌లో చైనా కాల్పులకు తెగబడింది. మమ్మల్ని రెచ్చగొట్టినా సంయమనం పాటించినట్లు ’ భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News