కార్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

దిశ, ముధోల్: పార్క్ చేసిన రెండు కార్లను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 12.30 సమయంలో నిప్పుపెట్టిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రములోని శివాలయం గుడి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే మంటలు అర్పగా అప్పటికే రెండు కార్లు పూర్తిగా దగ్ధమైనవి. ఈ అగ్నిప్రమాదంలో ఆలయ పూజారి కారు, లక్ష్మణ్ రావు కారు కాలిపోయిందని స్థానికులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు విలువ రూ.20 లక్షలు నష్టం వాటిల్లిందని […]

Update: 2021-06-09 01:56 GMT

దిశ, ముధోల్: పార్క్ చేసిన రెండు కార్లను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి 12.30 సమయంలో నిప్పుపెట్టిన సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రములోని శివాలయం గుడి వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే మంటలు అర్పగా అప్పటికే రెండు కార్లు పూర్తిగా దగ్ధమైనవి. ఈ అగ్నిప్రమాదంలో ఆలయ పూజారి కారు, లక్ష్మణ్ రావు కారు కాలిపోయిందని స్థానికులు తెలిపారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు విలువ రూ.20 లక్షలు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై అరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News