వివాహితకు రెండో పెళ్లి.. కొడుకును గోడకేసి కొట్టి చంపిన భర్త

దిశ, పటాన్‌చెరు: మరో పెండ్లి చేసుకున్న మహిళ.. తనకు, తన  కొడుక్కి అండగా ఉంటాడనుకున్న రెండో భర్త వారి పాలిట యముడయ్యాడు. ప్రతి చిన్న విషయానికి బాలుడిని చిత్రహింసలు పెడుతూ చివరకు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పటాన్‌చెరు‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఇస్నాపూర్‌లోని పద్మరావునగర్‌లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినయ్ అనే వ్యక్తి కొన్నేండ్ల క్రితం ఓ వివాహితను పెండ్లి చేసుకున్నాడు. సదరు వివాహితకు ఓ కొడుకు(అరుణ్ 6) […]

Update: 2021-11-02 11:45 GMT

దిశ, పటాన్‌చెరు: మరో పెండ్లి చేసుకున్న మహిళ.. తనకు, తన కొడుక్కి అండగా ఉంటాడనుకున్న రెండో భర్త వారి పాలిట యముడయ్యాడు. ప్రతి చిన్న విషయానికి బాలుడిని చిత్రహింసలు పెడుతూ చివరకు గోడకేసి కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన పటాన్‌చెరు‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఇస్నాపూర్‌లోని పద్మరావునగర్‌లో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినయ్ అనే వ్యక్తి కొన్నేండ్ల క్రితం ఓ వివాహితను పెండ్లి చేసుకున్నాడు. సదరు వివాహితకు ఓ కొడుకు(అరుణ్ 6) ఉన్నాడు. కానీ, భార్యను మంచిగనే చూసుకున్న రెండో భర్త వినయ్ కొడుకును చిత్ర హింసలు పెట్టేవాడు. ప్రతి చిన్న విషయానికి కొట్టేవాడు. దీంతో పిల్లగాడిని తీసుకుని వెళ్లిపోతానంటూ భార్య మొండికేసింది. ఇంకోసారి కొడితే ఇంట్లో ఉండనంటూ హెచ్చరించింది. ఇది మనసులో పెట్టుకున్న వినయ్.. అరుణ్‌‌ను చూస్తూ ఓర్వలేకపోయాడు.

ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇంటికొచ్చిన వినయ్.. భార్య ఇంట్లో లేకపోవడంతో అరుణ్‌ను కొట్టాడు. అంతటితో ఆగక గోడకేసి బలంగా బాదాడు. ఈ దెబ్బలు తాళలేక ఆరేండ్ల అరుణ్ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో భయానికి గురైన వినయ్ హాస్పత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే చనిపోయినట్టు డాక్టర్ ధృవీకరించడంతో.. ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చి పడుకోబెట్టాడు. అనంతరం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఉదయం పనికి వెళ్లిన తల్లి రాత్రి తిరిగొచ్చేసరికి పిలగాడు విగతజీవిగా కనిపించడంతో కన్నీరుపెట్టుకుంది. చంపింది భర్తనే అని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ రామానాయుడు వివరించారు.

Tags:    

Similar News