కోడలిపై కన్నేసిన మామ.. కొడుకు ఏం చేసాడో తెలుసా.?

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకీ జిల్లాలో మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు. ఈ విషయం కాస్త మహిళ భర్తకు తెలియడంతో.. […]

Update: 2021-06-07 20:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాలని ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. యూపీలోని బారాబంకీ జిల్లాలో మల్లాపూర్‌కు చెందిన చంద్రరామ్ అనే వ్యక్తి గుజరాత్‌కు చెందిన ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని తన కోడలిని రూ. 80 వేలకు విక్రయించాడు.

ఈ విషయం కాస్త మహిళ భర్తకు తెలియడంతో.. బాధితురాలి భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బాధితురాలిని కాపాడారు. అనంతరం 8 మంది ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముఠా ఇప్పటి వరకు 300 మంది మహిళలను ఇలా కొనుగోలు చేసినట్టు పోలీసులకు తెలియడంతో వారు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులు అరెస్ట్ చేసిన ముఠాలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ముఠాలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మామ చంద్రరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News