బైకును ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మల్కాపురం నుంచి వడ్డాదివీరవరం వైపు వెళ్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ […]

Update: 2020-09-05 21:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మల్కాపురం నుంచి వడ్డాదివీరవరం వైపు వెళ్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News