బావిలో పడ్డ రైతు.. కారణం ఇదే

దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ […]

Update: 2020-07-17 06:08 GMT

దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగలడంతో రైతు బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కోదాడ మండలం కూచిపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శెట్టి రాముడు (42) గురువారం ఉదయం నారుమడికి నీళ్లు పెట్టడానికి తన వ్యవసాయ పొలానికి వెళ్లి మోటార్ వేసే క్రమంలో విద్యుత్ షాక్ గురై పక్కన ఉన్న బావిలో పడి మృతి చెందారు. సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి వెతకడం ప్రారంభించారు. బావిలో చెప్పులు కనపడటంతో గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో రాముడి శవం దొరికింది. మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పటల్‌కు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News