డోర్నకల్‌లో విషాదం.. అప్పుల బాధతో చెట్టుకు ఉరి వేసుకున్న రైతు

దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండంలోని వెన్నారం గ్రామం రాముతండాకు చెందిన భూక్య చీమ(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాడు. మొదట్నుంచీ వాతావరణం సహకరించకపోవటం, తీరా కంకి దశలో వర్షాలు.. పడటంతో దిగుబడి వస్తుందో..? రాదో..? అని తీవ్ర మనోవేదనకు గురై తన […]

Update: 2021-11-18 05:47 GMT

దిశ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండంలోని వెన్నారం గ్రామం రాముతండాకు చెందిన భూక్య చీమ(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకున్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాడు. మొదట్నుంచీ వాతావరణం సహకరించకపోవటం, తీరా కంకి దశలో వర్షాలు.. పడటంతో దిగుబడి వస్తుందో..? రాదో..? అని తీవ్ర మనోవేదనకు గురై తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags:    

Similar News