ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం: పీటీఐ

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పీటీఐ ట్వీట్ చేసింది. మెదడులో గడ్డ కట్టడంతో ప్రణబ్ సర్జరీ కూడా చేయించుకున్నారని పీటీఐ తెలిపింది. ప్రస్తుతం ప్రణబ్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనతో కలిసిన వారు కోవిడ్ టెస్టులు కూడా చేయించుకోవాలని ప్రణబ్ దాదా ట్వీట్ కూడా చేసిన విషయం విదితమే. సాయంత్రం వరకు […]

Update: 2020-08-10 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు పీటీఐ ట్వీట్ చేసింది. మెదడులో గడ్డ కట్టడంతో ప్రణబ్ సర్జరీ కూడా చేయించుకున్నారని పీటీఐ తెలిపింది. ప్రస్తుతం ప్రణబ్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందతున్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తనతో కలిసిన వారు కోవిడ్ టెస్టులు కూడా చేయించుకోవాలని ప్రణబ్ దాదా ట్వీట్ కూడా చేసిన విషయం విదితమే. సాయంత్రం వరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా .. ప్రస్తుతం ప్రణబ్ దాదా ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు.. వెంటిలెటర్ పై ఉన్నట్లు పీటీఐ తెలిపింది.

Tags:    

Similar News