బ్రేకింగ్.. ఈటల పర్యటన రద్దు

దిశ, హుజురాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో రోడ్ షోలు, ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఇల్లందకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటించాల్సి ఉండగా వర్షం కారణంగా రోడ్ షో రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే మంగళవారం కమలాపూర్‌లో రోడ్ షో అనంతరం.. ఈటల రాజేందర్.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రజలను […]

Update: 2021-06-08 22:32 GMT

దిశ, హుజురాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో రోడ్ షోలు, ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం ఇల్లందకుంట మండలంలో ఈటల రాజేందర్ పర్యటించాల్సి ఉండగా వర్షం కారణంగా రోడ్ షో రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే మంగళవారం కమలాపూర్‌లో రోడ్ షో అనంతరం.. ఈటల రాజేందర్.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రజలను అవమానిస్తే కేసీఆర్‌కు వారు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. హుజురాబాద్ విజయమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని స్పష్టం చేశారు. ప్రజలు తన వెంటే ఉంటారని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు ఈటల. ఇక టీఆర్ఎస్ పార్టీతో మరో యుద్ధానికి హుజురాబాదే నాంది పలుకనుందని ఈటల వెల్లడించారు.

 

Tags:    

Similar News