సూపర్ స్కెచ్ వేసిన ఈటల.. కేసీఆర్‌కు కొత్త సమస్య.!

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. శనివారం దళిత బంధుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని అన్నారు. 10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు […]

Update: 2021-08-14 04:37 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ ఎన్నిక నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. శనివారం దళిత బంధుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని అన్నారు.

10 లక్షల రూపాయలను దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. దళిత బంధు డబ్బులపై కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ల అజమాయిషీ ఉండకూడదని వెల్లడించారు. దళిత బంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళిత బంధు అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే(ఈటల రాజేందర్) దీక్షకు కూర్చుంటానని పేర్కొన్నారు.

Tags:    

Similar News