ఈనెల 16లోగా నమోదు చేయాలి

దిశ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పంచాయతీ వివరాలను ఈనెల 16లోగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఈ–పంచాయతీ వివరాలు, ధరణి పోర్టల్ వివరాలను […]

Update: 2020-10-13 11:20 GMT

దిశ, మెదక్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పంచాయతీ వివరాలను ఈనెల 16లోగా పూర్తి చేయాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ఈ–పంచాయతీ వివరాలు, ధరణి పోర్టల్ వివరాలను ఈనెల 16లోగా పూర్తి చేయాల్సిందేనని సూచించారు. అలాగే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఈనెలాఖరు (అక్టోబర్ 31)లోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News