కోరిక తీర్చలేదని.. గొడ్డలితో దాడి

దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై తాగుబోతు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. లక్ష్మయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగుతూ గ్రామంలో గొడవలు సృష్టించేవాడు. ఈ నేపథ్యంలోనే తాగొచ్చిన అతను తన కోరిక తీర్చాలని ఓ వివాహితతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న గొడ్డలితో దాడి చేశాడు. మహిళకు […]

Update: 2020-09-02 23:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోరిక తీర్చలేదనే కోపంతో వివాహితపై తాగుబోతు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో గురువారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. లక్ష్మయ్య అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగుతూ గ్రామంలో గొడవలు సృష్టించేవాడు. ఈ నేపథ్యంలోనే తాగొచ్చిన అతను తన కోరిక తీర్చాలని ఓ వివాహితతో గొడవకు దిగాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై పక్కనే ఉన్న గొడ్డలితో దాడి చేశాడు. మహిళకు తీవ్రగాయాలు కావడంతో బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దాడికి గల కారణాలపై ఆరా తీశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News