శాంతి భద్రతల పర్యవేక్షణ మీదే : డీజీపీ

దిశ, క్రైమ్ బ్యూరో : రైతాంగ సమస్యలపై పలు పార్టీలు మంగళవారం చేపట్టనున్న భారత్ బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలతో మహేందర్ రెడ్డి సోమవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా చర్యలు […]

Update: 2020-12-07 12:00 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రైతాంగ సమస్యలపై పలు పార్టీలు మంగళవారం చేపట్టనున్న భారత్ బంద్ సందర్భంగా ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో కమిషనర్లు, ఎస్పీలతో మహేందర్ రెడ్డి సోమవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజానీకానికి ఏ విధమైన ఇబ్బందులు, అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసులకు ఏవిధమైన అంతరాయం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హింసాయుత చర్యలు జరగకుండా అప్రమత్తతతో ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాధాన్యత నివ్వాలని మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.

Tags:    

Similar News