Puri Jagannadh: పూరి జగన్నాథ్ " రామ్" నే టార్గెట్ చేస్తున్నాడా ?

లైగర్ ప్లాప్ తరువాత విజయ్ దేవరకొండ నటించడానికి దర్శకులు గౌతమ్ తిన్ననూరి, పరశురాం లైనులో ఉన్నారు.

Update: 2023-03-04 03:50 GMT

దిశ,వెబ్ డెస్క్ : లైగర్ ప్లాప్ తరువాత విజయ్ దేవరకొండ నటించడానికి దర్శకులు గౌతమ్ తిన్ననూరి, పరశురాం లైనులో ఉన్నారు. హీరోయిన్ అనన్య పాండే రెండు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ఇలా వారు వారి పనుల్లో లీనమై పోయారు. పూరి జగన్నాథ్ ఒక్కడే నెక్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేకుండా ఉండిపోయారు.

మూడు నెలల్లో ఎలా సినిమా తియ్యాలో పూరి నుంచి నేర్చుకోవాలని రాజమౌళి , సుకుమార్ ఓ సందర్భంలో చెప్పారు. రెండేళ్లు సమయం తీసుకోని లైగర్ తీస్తే అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. పూరి మూడు నెలల్లో సినిమా చేద్దామనుకున్నా ముందు డేట్స్ ఇచ్చే హీరోలే దొరకడంలేదట. చిరంజీవి నుంచి పిలుపు అందుకున్న పూరి కథ రాయడం మొదలు పెట్టారట. మెగాస్టార్ ఉంచి కబురు అందిన ఆయన్ని నమ్మలేక మరొక ప్రాజెక్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాడట. చిరంజీవి కథ రాయమన్నా ఆయన్ని ఒప్పించడం అంత సులువు కాదు. అందుకే ఇస్మార్ట్ శంకర్ రామ్‌ను లైనులో పెట్టాడట. రామ్ కోసం కథని కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలిసి ఉంది. 

Tags:    

Similar News